హెల్త్ బులిటిన్: నలుగురు చిన్నారుల పరిస్థితి విషమం!!

 

మాసాయిపేట రైల్వే క్రాసింగ్ దగ్గర జరిగిన దుర్ఘటనలో 16 మంది చిన్నారులు మరణించిన విషాదం అందరి మనసులనూ కలచివేస్తేంది. కాగా తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులలో నలుగురి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందని తెలుస్తోంది. తరుణ్, వరుణ్, ప్రశాంత్, వైష్ణవి అనే నలుగురు చిన్నారులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని యశోదా ఆస్పత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటిన్‌లో పేర్కొన్నారు. గాయపడిన చిన్నారులలో ఎనిమిది మంది ప్రమాదకర పరిస్థితి నుంచి బయటపడ్డారని, వీరిని శనివారం నాడు ఐసీయు నుంచి సాధారణ వార్డుకు మారుస్తామని ఆ బులిటిన్‌లో పేర్కొన్నారు.