వారిని రక్షించేందుకే బాబు పల్నాడు డ్రామా: విజయసాయి ఫైర్

 

 

టీడీపీ ఈరోజు చేయ తలపెట్టిన చలో ఆత్మకూర్ ర్యాలీ వైసిపి, టీడీపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈరోజు ప్రజాస్వామయంలో చీకటి రోజు అని టీడీపీ నేత లోకేష్ ట్విట్ చేసారు. దీనికి వైసిపి ఎంపీ విజయ్ సాయి రెడ్డి కౌటర్ ఇస్తూ "యరపతినేని,కోడెల, దూడలను రక్షించుకునేందుకే బాబు ఈ డ్రామా ఆడుతున్నారని విజయసాయి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని రచ్చ చేయడం   ద్వారా రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకుండా చేయాలన్నది చంద్రబాబు ముఠా కుట్రలు మొదలు పెట్టింది" అని ఆరోపించారు. పల్నాడులో ఐదేళ్లు రౌడీలే రాజ్యం చేసారని.. కనీసం ఇపుడైన ప్రశాంతత నెలకొనడం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదని అయన తన ట్విట్ లో విమర్శించారు.