వైసీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ లో మాగుంట పేరు!!

 

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓ వైపు ప్రధాన పార్టీలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూనే మరోవైపు గెలుపు గుర్రాలను వెతికే పనిలో నిమగ్నమయ్యాయి. ప్రతిపక్ష వైసీపీ ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. బాపట్ల, తిరుపతి, చిత్తూరు, కర్నూలు ఎంపీ సీట్లు మినహా అన్ని స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఖరారైనట్టు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి ఓ లిస్ట్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ లిస్ట్ లో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు ఉండటం విశేషం. మాగుంట వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. మరోవైపు ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కూడా కలిశారు. దీంతో ఆయన జనసేనలో చేరతారు అనే వార్తలు కూడా వచ్చాయి. అంతేనా ఆయన అసలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చంద్రబాబుకి చెప్పారు. ఇన్ని ట్విస్ట్ ల మధ్య వైసీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ లో మాగుంట పేరు ఉండటం ఆసక్తి రేపుతోంది. మరి వైసీపీ అధికారికంగా ప్రకటించే లిస్ట్ లో ఈ పేర్లు ఉంటాయో లేదో చూడాలి.

 

  • శ్రీకాకుళం - దువ్వాడ శ్రీనివాస్
  • విజయనగరం - బొత్స ఝాన్సీ
  • విశాఖ - ఎంవివి చౌదరి
  • అనకాపల్లి - వరద కల్యాణి
  • అరకు - గొట్టేటి మాధవి
  • ఒంగోలు - మాగుంట శ్రీనివాసులు రెడ్డి
  • రాజమండ్రి - మార్గాని భరత్
  • అమలాపురం- చింతా అనురాధ
  • నరసాపురం - రఘురామ కృష్ణంరాజు
  • ఏలూరు - కోటగిరి శ్రీధర్
  • విజయవాడ - దాసరి జై రమేష్
  • మచిలిపట్నం - బాల‌శౌరి
  • నరసరావు పేట- శ్రీ కృష్ణ దేవరాయలు
  • గుంటూరు -మోదుగుల వేణుగోపాలరెడ్డి
  • నెల్లూరు - మేకపాటి రాజమోహన్ రెడ్డి
  • కాకినాడ - బలిజి అశోక్
  • రాజంపేట - మిథున్ రెడ్డి
  • కడప - అవినాష్ రెడ్డి
  • అనంతపురం - పిడి రంగయ్య
  • నంద్యాల - శిల్పా రవిచంద్ర
  • హిందూపూర్ - గోరంట్ల మాధవ్