మరోసారి కోర్టు మెట్లు ఎక్కిన రోజా.. తప్పని కష్టాలు

 

వైసీపీ  ఎమ్మెల్యే రోజా ఏదో ఒక కారణంతో కోర్టు మెట్లు మాత్రం ఎక్కాల్సి వస్తుంది. మొన్నటి వరకూ అసెంబ్లీ సస్పెన్షన్ నేపథ్యంలో కోర్టుల చుట్టూ తిరిగిన రోజా ఇప్పుడు ఎన్నిక నేపథ్యంలో మరోసారి కోర్టుకి వెళ్లారు. రోజా ఎన్నికను సవాల్ చేస్తూ, హైకోర్టులో పిటిషన్ దాఖలవడంతో కోర్టు రోజాకి నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై స్పందించిన రోజా పిటిషన్ ను కొట్టివేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఈ రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించింది. అయితే రెండు వాదనలను ఒకేసారి వింటామని ప్రకటించింది. దీంతో రోజా.. రెండు వాదనలు ఒకేసారి ఎలా వింటారని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు రోజా పిటిషన్ ను విచారణకు స్వీకరించి వచ్చే నెల చివరి వారంలో దీనిపై విచారణ చేపట్టనుంది.