శవం కనిపిస్తే చాలు రాజకీయం చేస్తున్న బాబు!!

 

అనంతపురం జిల్లాలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించటంతో పాటు టీడీపీ కార్యకర్తల్లో భరోసా నింపటానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబు యాత్ర చేశారు. అయితే బాబు యాత్రపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు టీడీపీయే నాంది పలికిందని వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బాబే యాత్రలు చెయ్యటం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శలు గుప్పించారు.

ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా టీడీపీ నేతలకు బుద్ది రావడం లేదన్నారు. అనంతపురంలో శాంతిభద్రతల గురించి బాబు మాట్లాడటం విడ్డురంగా ఉందని, బాబు ఇప్పటికైనా సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. ఇక బాబు శవం కనిపిస్తే చాలు రాజకీయం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. శవ రాజకీయం చేయడమే లక్ష్యంగా బాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అనంతపురం జిల్లాలో ఎన్నో దాడులు, హత్యలు జరిగాయని కేతిరెడ్డి ఆరోపించారు. 

ఇక రాష్ట్రంలో బాబు హయాంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలను పరామర్శించడానికి ఒక్కసారి కూడా బాబు రాలేదని ఆయన విమర్శించారు. ఇప్పుడు బాబు శవం దొరికితే రాజకీయం చేసేందుకు వస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇదే దిన చర్యగా చేసుకుంటున్నారని కేతిరెడ్డి మండిపడ్డారు.