బాబు, పవన్ లపై వైసీపీ ఎమ్మెల్యే బూతు పురాణం

రాజధాని అమరావతి కోసం ఉద్యమిస్తున్న రైతులపై అధికార పార్టీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. పెయిడ్ ఆర్టిస్టులు అని.. రైతులైతే బురదలో దిగి పని చేసుకోవాలి కానీ ఇలా రోడ్ల మీద ప్యాంటులు వేసుకొని తిరగరు అని.. మెడలో బంగారం ఉన్న మహిళలు రైతులు ఎలా అవుతారని.. ఇలా రకరకాల వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా వైసీపీ నేతల తీరు మారట్లేదు. రైతులపైనా, రైతులకు మద్దతుగా నిలుస్తున్న వారిపైనా నోరు పారేసుకుంటున్నారు. 

తాజాగా కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై హద్దు దాటి వ్యాఖ్యలు చేశారు. రాయడానికి వీలులేని బూతులు మాట్లాడారు. "చంద్రబాబూ నిన్ను ఒరేయ్ ల** **కా అని తిట్టాలనుంది వెదవకాన" అని నోరు పారేసుకున్నారు. "పవన్ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు చేసేవి ల** పనులు.. దొంగ నా కొడుకు" అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చేసిన వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆయనపై నెటిజనులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రజాప్రతినిధి అయ్యుండి ఇవేం మాటలు అని మండిపడుతున్నారు. మాజీ సీఎంని ఇలాంటి మాటలు అనడం ఏంటి? ఇదేం సంస్కారం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.