జైలుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..

 

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 15 రోజుల రిమాండ్ కు తరలించారు. చిత్తూరు జిల్లా సబ్ కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసనకు దిగిన ఘటనలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను పుత్తూరు కోర్టులో హాజరుపరచగా.. దీనిపై విచారించిన కోర్టు చెవిరెడ్డికి 15 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వెంటనే పోలీసులు ఆయన్ను చిత్తూరు జైలుకు తరలించారు.

 

మరోవైపు చెవిరెడ్డికి రిమాండ్ విధించడంపై ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం బెయిల్ ఇవ్వదగ్గ ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు హేయమని మండిపడ్డారు. చెవిరెడ్డిపై చంద్రబాబు సర్కారు కక్షకట్టిందన్నారు. అక్రమంగా కేసులు బనాయించి వేధిస్తోందని, పోలీసులు ప్రభుత్వ కనుసన్నల్లో ఉంటున్నారన్నారు.