విజయవాడ రాజధానికి ఓకే.. జగన్

 

విజయవాడను ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా ప్రకటించడాన్ని తాను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జగన్ అన్నారు. విజయవాడ రాజధాని కావడం పట్ల తమ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే చంద్రబాబు రాజధాని ప్రకటించిన తీరు విషయం మీదే తనకు అభ్యంతరం వుందని జగన్ అన్నారు. ముందు చర్చ జరిగి తర్వాత రాజధానిని ప్రకటిస్తే బాగుందేదని, చంద్రబాబు ప్రకటించిన తర్వాత చర్చ జరిగి లాభం లేదని ఆయన అన్నారు. ఏది ఏమైనప్పటికీ విజయవాడ కొత్త రాజధాని కావడాన్ని తాను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నానని అన్నారు. అయితే విజయవాడలో రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిపోకుండా చూడాలని అభిప్రాయపడ్డారు.