జగన్ పై యాక్షన్ తీసుకోండి.. సీఈసీ ఆదేశం...

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని కాల్చి పారేయాలి.. ఉరితీయాలి.. చంద్రబాబుకు అహంకారం.. కళ్లు నెత్తిమీద కెక్కాయి.. ఇలా ఒకటా రెండా నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో జగన్ రెచ్చిపోయి మరీ నోరు పారేసుకున్న సంగతి తెలిసిందే.  అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై జగన్ కు కేంద్ర ఎన్నికల సంఘ షాకిచ్చింది. ఈ ఎన్నికలే సార్వత్రిక ఎన్నికలు అన్నరేంజ్ లో ఆయన చంద్రబాబుపై కామెంట్లు చేశారు. ఇక జగన్ చేసిన వ్యాఖ్యలకు గాను ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కానీ వారు పట్టించుకోలేదు. దీంతో ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, నిమ్మల కిష్టప్ప తదితరులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. జగన్ చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన సీఈసీ..ముఖ్యమంత్రిపై జగన్ చేసిన వ్యాఖ్యలు చాలా దారుణంగా ఉన్నాయని... ఇవి ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని..తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీచేసింది.