TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జర్నలిస్టు స్థలం కబ్జా.. ఆపై దాడి

Published on: Tue Jun 28, 2022 3:10PM

వైసీపీ ఆగడాలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. వైసీపీ గూండాల దాడులు విపక్ష నేతలు, పేదలు, ప్రజలు ఇలా అన్ని వర్గాలపై అంతూ పొంతూ లేకుండా పెరిగిపోతున్నాయి.

ఇప్పుడు ఆ జాబితాలోకి జర్నలిస్టులు కూడా చేరారు. తాజాగా శ్రీబాలాజీ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జర్నలిస్టు ఈశ్వర్ పై వైసీపీ నేత, కాళహస్తీస్వర ఆలయం బోర్డు సభ్యుడు జయశ్యాం దాడి చేశారు. ఈ దాడిని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి లోకేష్ తీవ్రంగా ఖండించారు.

జర్నలిస్టు ఈశ్వర్ కు చెందిన స్థలాన్ని జయశ్యాం కబ్జా చేశాడనీ, దీనికి ప్రశ్నించినందుకు ఈశ్వర్ ను దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడనీ లోకేష్ విమర్శించారు. జర్నలిస్టుపై దాడి చేసిన జయశ్యాంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.