2018-19 బడ్జెట్ ప్రవేశపెట్టిన యనమల...

 

ఏపీ అర్ధిక మంత్రి  యనమల రామకృష్ణుడు 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంక్షేమ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటు తెలిపారు. అమరావతిపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయని.. 10.96 శాతం వృద్ధి రేటును సాధించామని తెలిపారు. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించేలా పనిచేస్తున్నామని... కేంద్ర నుంచి నిధులు అందక చాలా బాధలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బడ్జెట్ వివరాలు చూస్తే..

 

* రాష్ట్ర బడ్జెట్ - రూ. 1,91,063.61 కోట్లు
* కేపిటల్ వ్యయం - రూ. 28,678.49 కోట్లు
* ఆర్థిక లోటు - రూ. 24,205.21 కోట్లు  
* వ్యవసాయ రంగానికి - రూ. 12,355.32 కోట్లు
* సాగునీటి రంగానికి - రూ. 16,978.23 కోట్లు
* ఇంధన రంగానికి - రూ. 5,052.54 కోట్లు
* సంక్షేమ రంగానికి - రూ. 13,720 కోట్లు
* గ్రామీణాభివృద్ధికి - రూ. 20,815.98 కోట్లు
* మత్స్యకారుల అభివృద్ధికి - రూ. 77 కోట్లు
* న్యాయశాఖకు - రూ. 886 కోట్లు
* విద్యాశాఖకు - రూ. 24,185 కోట్లు
* సాంకేతిక విద్యకు - రూ. 818 కోట్లు   
* పౌష్టికాహార లోపం నియంత్రణకు రూ.360 కోట్లు, వారానికి 5 రోజుల గుడ్లు పథకానికి రూ.266 కోట్లు
* డ్వాక్రా మహిళలకు శానిటరీ నాప్‌కిన్స్ కోసం రూ.100 కోట్లు
* హిజ్రాల సంక్షేమం కోసం రూ.20 కోట్లు
* రైతు రుణమాఫీకి రూ.4,100 కోట్లు
* స్టార్టప్‌లకు రూ.100 కోట్లు
* ‘అన్న’ క్యాంటీన్ల కోసం రూ.200 కోట్లు
* ‘ఎన్టీఆర్ జలసిరి’ కోసం రూ.100 కోట్లు