రేపటి నుంచి కేదార్నాథ్ ఆలయంలో పూజలు
Published on: Tue Apr 21, 2026 4:05PM

హిమాలయ పర్వతాల మధ్య విరాజిల్లుతున్న పవిత్ర క్షేత్రం కేదార్నాథ్ ఆలయం రేపు ఉదయం 8 గంటలకు భక్తుల దర్శనార్థం తిరిగి తెరుచుకోనుంది. శీతాకాల విరామం అనంతరం ఆలయ ద్వారాలు తెరుచుకోనున్న నేపథ్యంలో భక్తుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వేద మంత్రోచ్చారణల నడుమ సంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను అధికారికంగా తెరవనున్నారు. ఇప్పటికే దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కేదార్నాథ్కు చేరుకుంటున్నారు.
ఈసారి ఆలయాన్ని అత్యంత వైభవంగా అలంకరించారు. సుమారు 51 క్వింటాళ్ల పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పుష్పాల అలంకరణతో కేదారేశ్వరుడి ఆలయం మరింత దివ్య కాంతితో మెరిసిపోతోంది. రేపటి నుంచి భక్తులకు కేదారేశ్వరుడి దర్శనం ప్రారంభం కానుండటంతో యాత్ర సీజన్కు శ్రీకారం చుట్టినట్టైంది. భారీగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


