TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రపంచవ్యాప్తంగా బ‌డికి బయట 78.2 మి. పిల్ల‌లు.. యు. ఎన్‌ నివేదిక

Published on: Mon Jun 27, 2022 12:35PM

ఒక  కొత్త నివేదిక ప్రకారం, విద్యా సహాయం అవసరమయ్యే సంక్షోభ ప్రభావిత దేశాలలో పాఠశాల వయ స్సు పిల్లల సంఖ్య 2016 లో 75 మిలియన్ల మంది వుండ‌గా,  ప్రస్తుతం 222 మిలియన్లకు పెరిగిందని ఐక్యరాజ్యసమితి జూన్ 21, 2022న ప్రచురించిన నివేదిక  పేర్కొన్న‌ది. వారిలో, 78.2 మిలియన్లు తరచుగా దీర్ఘకాలిక సంఘర్షణలు, అత్యవసర పరిస్థితుల కారణంగా పాఠశాలకు దూరంగా ఉన్నారు. సంక్షోభం బాధిత పిల్లల సంఖ్య,  విద్య అవసరం ఉన్న కౌమారదశలోని వారు అనే విశ్లేషణ ప్రకారం, బడి బయట ఉన్న పిల్లలలో 54 శాతం మంది బాలికలు, 17 శాతం మంది క్రియాత్మక ఇబ్బందులతో బాధపడుతున్న పిల్లలు,16 శాతం మంది బలవంతంగా వేరే ప్రాంతాల‌కు త‌ర‌లించ‌బ‌డిన‌వారూ వున్నారు.

అత్యవసర పరిస్థితులు, దీర్ఘకాలిక సంక్షోభాలలో విద్య కోసం ఐక్య రాజ్య స‌మితి ప్ర‌పంచ‌ నిధి, సాయుధ పోరాటాలు, బలవంతంగా వేరే ప్రాంతాల‌కు త‌ర‌లింపులు, వాతావరణ ప్రేరిత విపత్తులు, దీర్ఘకాలిక సంక్షో భాల కారణంగా నాణ్యమైన విద్యను కోల్పోతున్న బాలికలు, అబ్బాయిల సంఖ్యను  ఎడ్యుకేషన్  కెనాట్ వెయిట్ (ఇసిడ‌బ్ల్యు)   ప్ర‌ధానంగా పేర్కొన్న అంశాలు ఎంతో ఆందోళనకరంగా ఉంది. సంక్షోభ పీడిత ప్రాం తాల్లో నివసిస్తున్న దాదాపు 119.6 మిలియన్ల మంది పిల్లలు పాఠశాలకు హాజరయ్యారు  కానీ గణితం లో లేదా పఠనంలో కనీస నైపుణ్యాన్ని సాధించలేకపోయారని కనుగొన్నారు. మరో 24.2 మిలియన్లు  ప్రీ-ప్రైమ రీ, ప్రైమరీ లేదా సెకండరీ స్కూల్‌లో గణితం లేదా పఠనంలో కనీస నైపుణ్యాన్ని సాధిస్తున్నారు, అయితే ఇప్పటికీ సంక్షోభాల వల్ల ప్రభావితమయ్యారు.  వీరికి మద్దతు అవసరం అని స్ప‌ష్టం చేసింది. 84 శాతం మంది పూర్తిగా బడి బయట ఉన్న పిల్లలు లేదా 65.7 మిలి యన్లు దీర్ఘకాలిక సంక్షోభాలు ఉన్న ప్రాంతాల్లో నివసిస్తు న్నార‌ని నివేదిక  పేర్కొంది. ఈ  65.7 మిలియన్లలో మూడింట రెండొంతుల మంది ఆఫ్ఘనిస్తాన్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా, మాలి, నైజీరియా, సోమాలియా, ద‌క్షిణ సూడాన్, సూడాన్, పాకిస్తాన్,  యెమెన్‌లలో నివసిస్తున్నారు.

సబ్-సహారా ఆఫ్రికాలోని  పిల్లలు చ‌దువునేర్వ‌లేని  స్థితితో తీవ్రంగా దెబ్బతిన్నార‌ని లాభాపేక్షలేని సేవ్ ది చిల్డ్రన్ చేసిన మరొక నివేదిక తెలియ‌జేసింది.  శరణార్థుల కోసం ఏర్పాటైన‌ యు.ఎన్‌ హై కమిషనర్  ఇటీవలి నివేదిక ప్రకారం 2019-2020లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శరణార్థుల కోసం సెకండరీ స్థాయి విద్య లో స్థూల నమోదు 34 శాతంగా ఉంది. మహమ్మారికి ముందు, సంక్షోభ ప్రభావిత పిల్లలలో 9 శాతం మంది మాత్రమే గణితంలో కనీస నైపుణ్యాన్ని సాధించారు. సంక్షోభం-ప్రభావిత పిల్లలలో 15 శాతం మంది మాత్రమే ప్రారంభ తరగతుల్లో చదవడంలో కనీస నైపుణ్యాన్ని సాధించారని విశ్లేషణలో తేలింది. కోవిడ్‌- 19 మహమ్మారి, ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా పాఠశాలలు సుదీర్ఘకాలం మూసివేయడం వల్ల ప్రపంచ సంక్షోభం తీవ్ర మైందని నిపుణులు చెప్పారు.  సంక్షోభ తీవ్రత, క్రియాత్మక ఇబ్బందులతో ఉన్న పిల్లలు, వేరే ప్రాంతాల‌కు త‌ర‌లించ‌బ‌డిన కుటుంబాల‌  పిల్లలు, బడి బయట వున్న‌వారి శాతం సంబంధించి అందుబాటులో ఉన్న డేటాను ప్రభావితం చేసే కొత్త పద్దతిని తాజా అధ్యయనం ప్రతి పాదించింది.

యూనిసెఫ్  బ‌హుళ సూచిక  క్లస్టర్ సర్వేలు, అంతర్జాతీయ గణితం, సైన్స్ అధ్యయన డేటా బేస్‌లో అభి వృద్ధి  కోసం అంతర్జాతీయ విద్యార్థి అంచనా వివ‌రాలు కూడా అత్యవసర పరిస్థితుల్లో బడి బయట ఉన్న పిల్లల సంఖ్యను, అలాగే నేర్చుకోని వారి సంఖ్యను అంచనా వేయడానికి ఉపయోగించాలి. అందువల్ల తక్షణ విద్యా మద్దతు అవసరమ‌ని రచయి తలు సూచించారు. ఈ పద్దతి యొక్క పరిమితి ఏమిటంటే ఇది ప్రధానంగా సంక్షోభం-ప్రభావిత వ్యక్తులుగా పరిగణించబడే వ్యక్తుల నిష్పత్తిని సరిగ్గా అంచనా వేయ డంపై ఆధారపడి ఉంటుంది. అనేక పెద్ద సంక్షోభ-ప్రభావిత దేశాలలో, మూడు నుంచి నాలుగు సంవత్స రాల వయస్సు గల పిల్లలకు, ప్రాథమిక పాఠశాలకు ముందు సంవత్స రంలో ఉన్నవారికి పాఠశాల వెలు పల రేట్ల డేటా అందుబాటులో లేదని నివేదిక పేర్కొంది.