టీటీఈపై దాడి చేసింది లేడీ ప్రయాణికులే

 

హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రైల్లో మహిళా టీటీఈపై (టీసీ) మహిళలే దాడి చేసి చెయ్యి చేసుకున్నారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వెళ్ళే ఎంఎంటీఎస్ బేగంపేట స్టేషన్ దగ్గరకి రాగానే టీటీఈ విధులు నిర్వహిస్తున్న కౌసల్య అనే మహిళ కుమారి, రాధ, పద్మ అనే మహిళా ప్రయాణికులను టిక్కెట్ అడిగారు. వారి దగ్గర టిక్కెట్ లేకపోవడంతో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు మహిళలు టీటీఈ మీద దాడి చేశారు. టీటీఈ ఫిర్యాదుతో పోలీసులు ఆ ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. టీటీఈ కౌసల్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన మీద రైల్వే మజ్జూర్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.