మహిళా నిర్మాత అనుమానాస్పద మృతి

 

 ఒక ప్రముఖ టీవీ నిర్మాతగా ప్రోగ్రాముల రూపకల్పన చేసే మిలితా దత్ మండల్ అనే మహిళ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలోని వైశాలి ప్రాంతంతో అనుమానాస్పదంగా మరణించింది. ఈమె ఎనిమిది అంతస్తుల భవనం మీద నుంచి కిందపడి మరణించింది. సోమవారం రాత్రి ఘజియాబాద్‌లోని తన అపార్ట్ మెంట్ మీద నుంచి కిందపడి ఆమె మరణించింది. ఆమె మృతి అనుమానాస్పదంగా వుందని, ఇది హత్యా, ఆత్మహత్యా అనేది విచారణలో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు.