స్టేజ్‌పై సిద్దూకి ముద్దిచ్చింది

ఖరీదైన వాచ్, కుమారుడి కోసం లాబీయింగ్‌లు, ఏసీబీ ఏర్పాటు, కాకి వాలిందని కారు మార్చడం ఇలా ఏది చేసినా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తలనొప్పిగా మారుతోంది. తాజాగా ప్రజలందరూ చూస్తుండగానే..ఓ బహిరంగ సభలో అందరి ముందు ముఖ్యమంత్రికి ఓ మహిళ ముద్దు పెట్టింది. ఇవాళ బెంగుళూరులో జరిగిన కురుబ కమ్యూనిటీ సన్మాన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. చిక్‌మగ్‌ళూర్ జిల్లా తరికేరే ప్రాంతానికి చెందిన పంచాయతీ సభ్యురాలు గిరిజా శ్రీనివాస్‌ను సీఎం సిద్దరామయ్య సన్మానించారు. అంతే ఆమె సభావేదికపైనే అందరూ చూస్తుండగానే సీఎం బుగ్గ మీద ముద్దు పెట్టేసింది.ఈ పరిణామంతో సభలో ఉన్నవారంతా షాక్‌కు గురయ్యారు. దీనిపై సదరు మహిళ మీడియాతో మాట్లాడింది. ఆయన నా తండ్రిలాంటి వాడు..మొదటిసారి నేను ఆయన్ని కలుస్తున్నాను. ఆ సంతోషాన్ని ఆపుకోలేక ముద్దుపెట్టుకున్నాను...ఇందులో తప్పేముంది అని చెప్పింది. ముఖ్యమంత్రిని ఎవరో ముద్దుపెట్టుకున్నారంట అనే వార్త ప్రస్తుతం కర్ణాటకను ఊపేస్తోంది.