వైకాపాలోకి ధర్మాన..!

 

 

 

కాంగ్రెస్ మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్‌రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన గురువారం వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారని అంటున్నారు. ధర్మాన శ్రీకాకుళం ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అక్రమాస్తుల కేసులు ఆరోపణలు ఎదుర్కున్న ధర్మాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ధర్మాన కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా ఉన్నారు. గత ఉప ఎన్నికలలో ధర్మాన కాంగ్రెస్ తరపున ప్రచారం చేసినా,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున పోటీచేసిన ఆయన సోదరుడు కృష్ణదాస్ గెలుపొందారు.