మన దేశ ఆర్ధికమంత్రి ఎవరు మోడీజీ

 

ఆర్థికమంత్రి ఎవరా?.. ఇంత చిన్న ప్రశ్న పీఎం మోడీని అడగాలా?.. ఆ మాత్రం తెలీదా మోడీకి, అసలు అడగాలి కానీ కేంద్ర మంత్రుల పేర్లు గుక్క తిప్పుకోకుండా మోడీ చెప్తారు అంటారా.. ఆగండి ఆగండి ఇక్కడో తిరకాసు ఉందిలేండి.. ప్రస్తుత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీనా లేక పీయూష్ గోయాలా? అర్థంకాక కాంగ్రెస్ నేత మనీష్ తివారీకి బుర్ర వేడెక్కి పోతుందట.. అందుకే ఇక తట్టుకోలేక భారత ఆర్థిక మంత్రి ఎవరు మోడీ? అంటూ అడిగేసారు..

దీనిలో అర్ధంగాక పోవడానికి ఏముంది ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అని అందరికి తెల్సుగా అంటారా?.. మనీష్ ప్రశ్నకి కూడా కారణం ఉందిలేండి.. పీఎంవో వెబ్ సైట్లో ఒకరి పేరుంది, ఫైనాన్స్ మినిస్ట్రీ వెబ్ సైట్లో మరొకరి పేరుంది.. అందుకే మనీష్, ఆర్థిక మంత్రి ఎవరో చెప్పండి మోడీ అంటూ ప్రశ్నించారు.. అసలు మేటర్ ఏంటంటే అంతకముందు అరుణ్ జైట్లీ మెడికల్ ట్రీట్ మెంట్ కి వెళ్లిన సమయంలో ఆర్థిక శాఖ బాధ్యతలు పీయూష్ గోయల్ కి ఇచ్చారు.. తరువాత వెబ్ సైట్లు టైం కి అప్డేట్ చేయరు.. దాని వల్ల ఈ తికమక ఏర్పడింది అనమాట.