తెలంగాణ డిజిపిపై వేటు ?
Published on: Fri Nov 15, 2024 5:27PM
ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గమైన కొడంగల్ లో వికారాబాద్ కలెక్టర్ పై దాడి జరగడం పట్ల ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారు. డిజిపి జితేందర్ పై వేటు వేయడానికి రేవంత్ రెడ్డి రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుండగా అక్కడికి వచ్చిన కలెక్టర్ పై ఒక్కసారిగా దాడి జరిగిన సంగతి తెలిసిందే. కుట్ర దాగి ఉందని ఇంటెలిజెన్స్ ఎందుకు పసిగట్టలేకపోయిందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ తో బాటు డిజిపిపై క్లాసు తీసుకున్నట్లు వార్తలు అందుతున్నాయి. కలెక్టర్ పై హత్యాయత్నం చేసిన వారిపై ఉపేషించేది లేదని రేవంత్ రెడ్డి ప్రకటించారు. బిఆర్ఎస్ పథకం ప్రకారమే దాడి జరిగిందని వెల్లడి కావడంతో రేవంత్ చాలా సీరియస్ గా ఉన్నారు.


