TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బోజ్జిదొరకు పోలఫ్వరం శాపంగా మారుతుందా?

Published on: Mon Apr 16, 2012 11:45AM

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారు అయ్యింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే బాడిస దుర్గారావు కుమారుడైన బాడిస బోజ్జిదొర పోటీ చేయబోతున్నారు. నిజానికి బోజ్జిదొర కలలో కూడా తనకు కాంగ్రెస్ టిక్కెట్ వస్తుదని ఊహించలేదు. అయితే ఈయన తండ్రి బాడిస దుర్గారావుకు పోలవరం నియోజకవర్గంలో ఓటర్ల సానుభూతి ఉంది. దుర్గారావు 1987 ఉప ఎన్నికల్లో, 1989 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోలవరం నుంచి గెలిచారు. అయితే 1994, 1999 ఎన్నికలో ఓడిపోయారు. 1999 ఎన్నికల్లో ఆయన కేవలం 24 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత ఆయన ఆర్థికంగా పూర్తిగా చితికిపోయారు.

కాంగ్రెస్ పార్టీ తనను రాజకీయంగా వాడుకుని వదిలేసిందని బతికి ఉండగా ఆయన పలుమార్లు వాపోయారు. కొంతకాలం ఆయన టిడిపిలో కూడా ఉన్నారు. దుర్గారావు అత్యంత దయనీయస్థితిలో మృతిచెందారు. ఈయన పట్ల పోలవరం ప్రజలకు సానుభూతి ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకునే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వ్యూహాత్మకంగా ఆయన కుమారుడైన బోజ్జిదోరకు టిక్కెట్ ఇచ్చింది. నిజానికి బోజ్జిదోరకు ఈ టిక్కెట్టు అనూహ్యంగా లభించిన వరం లాంటిదే. అయితే ఈయనకు టిక్కెట్టు ఇవ్వటం పట్ల కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే అసంతృప్తి ప్రారంభమైంది. పలువురు నాయకులు బోజ్జిదొర అభ్యర్థిత్వాన్ని బహిరంగానే సవాల్ చేస్తున్నారు. దీంతో పార్టీలో ఉన్న అసంతృప్తి వచ్చే ఎన్నికల్లో బోజ్జిదొరకు శాపంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.