వందలాది మందిని కాపాడిన ఒకే ఒక్కడు

ఒకరి ప్రాణాలను కాపాడితేనే.. ఆ కాపాడిన వ్యక్తిని దేవుడిలా చూస్తారు.. అలాంటిది ఏకంగా కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడితే.. ఇలాంటి ఘటనే పశ్చిమబెంగాల్‌లో జరిగింది. బుర్ద్వాన్ జిల్లాలోని హౌరా-న్యూఢిల్లీ రైలు మార్గంలో పట్టాలకు ఉండే ఫిష్ ప్లేట్లు ఊడిపోవడాన్ని గమనించిన స్థానికుడు జరగబోయే ప్రమాదాన్ని ఊహించాడు. వెంటనే ఎరుపు రంగు వస్త్రాన్ని చేత్తూ ఊపుతూ రైలుకు ఎదురెళ్లాడు. అతన్ని చూసిన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేసి రైలును ఆపాడు. సడెన్‌గా రైలు ఆగిపోవడంతో ఏం జరిగిందోనని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకొని తమ ప్రాణాలు కాపాడిన స్థానికుడికి ధన్యవాదాలు తెలిపారు.