జూరాలకు భారీగా నీరు.. పవర్ హౌస్ బుడుంగ్!

 

కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతూ వుండటంతో కర్ణాటక సరిహద్దుల్లో వున్న మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూరాలా ప్రాజెక్టు ఇన్ ఫ్లో 97,300 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 78,600 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు 11 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జూరాల ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 317.70 అడుగులకు చేరింది. ఈ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 318.52 అడుగులు. జూరాలకు భారీగా వస్తున్న వరదల వల్ల పవర్ హౌస్ నీటమునిగింది. పవర్‌హౌస్‌లోకి భారీగా నీరు చేరడంతో కోట్లలో ఆస్తినష్టం సంభవించింది.