కెటీఆర్ , రాజనర్సింహ మధ్య మాటల యుద్దం
Published on: Thu Sep 19, 2024 5:11PM
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ , వైద్య ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ మధ్య మాటల యుద్దం కొనసాగింది. గాంధీ ఆస్పత్రిలో రోగుల మరణాలు ఎక్కువయ్యాయని కెటిఆర్ ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల మాతా శిశు మరణాలు ఎక్కువయ్యాయని బిఆర్ ఎస్ నేత ట్వీట్ చేస్తూ విమర్శించారు. దీనికి మంత్రి దామోదరరాజనర్సింహ కౌంటర్ ఇచ్చారు. పేద ప్రజలను భయపెట్టొద్దని ఆస్పత్రుల కొచ్చే రోగుల మనో స్తైర్యం దెబ్బతినే మాటలు మానుకో కెటీఆర్ అంటూ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘాటుగా ట్వీట్ చేస్తూ స్పందించారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనను ప్రజలు తిరస్కరించిన విషయాన్ని దామోదర్ రాజనర్సింహ గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రులపై బురద చల్లుతూ కార్పోరేట్ ఆస్పత్రులను ప్రోత్సహించే వ్యాఖ్యలు మానుకోవాలని రాజనర్సింహ హెచ్చరించారు.


