ముంబైలోనె సచిన్ చివరి మ్యాచ్

 

Wankhede to host Sachin last match, Tendulkar retires from cricket, Sachin Tendulkar

 

 

లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ తన చివరి టెస్ట్ మ్యాచ్ సొంత గడ్డపైనే ఆడనున్నారు. సచిన్ 200వ టెస్టు మ్యాచ్ ముంబైలోని వాంఖెడే మైదానంలో జరుగనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ రోజు ఉదయం బీసీసీఐ సమావేశమై సచిన్ చివరి టెస్ట్ మ్యాచ్ అతడి హోంగ్రౌండ్ ముంబై లోని వాంఖెడే స్టేడియంలో జరపాలని నిర్ణయం తీసుకుంది. అయితే మాస్టర్ ఇప్పటికే వాంఖడేలో తన చివరి మ్యాచ్ ఆడతానని బోర్డును కోరాడు. దీనికి బోర్డు కూడా సానుకూలంగా స్పందించింది. తాను ఆడబోయే టెస్టు (200వ మ్యాచ్)ను తన తల్లి, గురువు రమాకాంత్ ఆచ్రేకర్ ప్రత్యక్షంగా చూడాలని మాస్టర్ కోరాడు.