TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఓటుకు నోటు కేసులో రేవంత్‌కి భారీ ఊరట

Published on: Fri Sep 20, 2024 6:24PM

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసును తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ  మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను సుప్రీం కోర్టు తొసిపుచ్చింది..  ప్ర‌స్తుతం జ‌రుగుతున్న కోర్టులోనే విచార‌ణ కొన‌సాగించాల‌ని ఆదేశించింది.  జ‌గ‌దీష్ పిటిష‌న్ పై  జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.  కేసులో రేవంత్‌రెడ్డి విచారణను ప్రభావితం చేస్తారన్నది కేవలం అపోహ మాత్రమేనని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.