ఈ ఏడు మృతదేహాలు ఎవరివి..?

కడప జిల్లా ఒంటిమిట్టలోని చెరువులో మృతదేహాలు కలకలం సృష్టించాయి. కడప-తిరుపతి జాతీయ రహదారిని అనుకుని ఉండే చెరువులో ఇవాళ స్థానికులు ఏడు మృతదేహాలను గుర్తించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుల్ని ఎర్రచందనం కూలీలుగా అనుమానిస్తున్నారు. వీరిని ఎవరైనా హత్య చేశారా..? లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం ఆ నోటా ఈనోటా పాకడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.