విశాఖలో ఘనంగా నౌకా వేడుకలు

విశాఖపట్నంలో నిన్న మొదలైన ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ వివ్యూ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఐఎన్‌ఎస్‌ నౌకలో కొలువుదీరిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నౌకా విన్యాసాలను తిలకించారు. తూర్పుతీరానికే అత్యంత కీలకమైన విశాఖపట్నంలో జరుగుతున్న ఈ నౌకా వేడుకలలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నరు నరసింహన్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకా దళం తన శక్తిని ప్రతిబింబిచేలా తన అమ్ముల పొదిలో ఉన్న వివిధ అస్త్రాలను ప్రదర్శించగా, నౌకా దళం సిబ్బంది వివిధ విన్యాసాలతో అతిథులను అలరించారు. ఈ నౌకోత్సవంలో పాల్గొనేందుకు 70కి పైగా నౌకలు వివిధ ప్రాంతాల నుంచీ విశాఖకు చేరుకున్నాయి.