బాబు విదేశాల నుంచి వచ్చేలోపు టీడీపీ ఖాళీ!!

 

ఏపీలో టీడీపీకి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరడానికి సిద్దమయ్యారన్న వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ తాజాగా బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో త్వరలోనే బీజేపీలో భారీగా చేరికలు ఉండబోతున్నాయని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చాలామంది బీజేపీవైపు చూస్తున్నారని అన్నారు. ప్రధానంగా టీడీపీ, కాంగ్రెస్, జనసేన నుంచే ఈ చేరికలు ఉంటాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు విదేశాల నుంచి వచ్చేలోపు ఏపీ ముఖచిత్రం మారిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారసత్వం, బానిసత్వం నుంచి బయటపడాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు.