విశాఖలో బాలిక అనుమానాస్పద మృతి..ఏం జరిగింది..?

విశాఖపట్నంలో బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించింది. నగరంలోని కృష్ణరాయపట్నంలో తొమ్మిదో తరగతి చదువుతున్న తనూజ నిన్న సాయంత్రం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది.. అలా ఆదృశ్యమైన అమ్మాయి, ఇవాళ ఉదయం శరీరంపై బట్టలు లేకుండా, నిర్జీవంగా ఓ చెత్తకుప్పలో శవమై కనిపించింది. ఆమెను ఆత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. జీవం లేకుండా పడి ఉన్న కూతురును చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలను సేకరిస్తున్నారు. మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.