విశాఖ బీచ్... గోవా స్టైల్

 

విశాఖపట్నం బీచ్‌ను గోవా తరహాలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. విశాఖ జిల్లా అచ్యుతాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పెట్టాలని భావిస్తున్నట్టు చెప్పారు. కొద్ది రోజుల క్రితమే టెక్నికల్ కమిటీ ఆ స్థలాన్ని పరిశీలించిందని అయ్యన్న తెలిపారు. అచ్యుతాపురంలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై నేవీ అధికారులు అభ్యంతరం తెలుపుతున్నారన్నారు. ఒకవేళ అచ్యుతాపురంలో వీలుకాకుంటే భీమిలిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. భీమిలిలో ఉన్న ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమకు కేటాయిస్తామని వెల్లడించారు.