టెస్ట్ మ్యాచుల్లో కోహ్లీ రికార్డులు...


టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో కోహ్లీ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఇప్పటకే భారత్-ఇంగ్లండ్ జట్టు మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా  వెయ్యి టెస్టు పరుగులను సాధించాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యి టెస్టు పరుగులను పూర్తి చేసుకున్న మూడో భారత కెప్టెన్గా నిలిచాడు. ఇప్పుడు మరో రికార్డ్ సాధించాడు. ముంబై టెస్ట్‌లో కోహ్లీ మ‌రోరికార్డు కూడా అందుకున్నాడు. టెస్టు కెరీర్ లో మొత్తం 4000 ర‌న్స్‌ను పూర్తి చేశాడు. అతి త‌క్కువ మ్యాచ్‌ల్లో 4వేల మైలురాయిని చేరుకున్న ఆర‌వ భార‌త బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ రికార్డుకెక్కాడు. గ‌తంలో సెహ్వాగ్‌, స‌చిన్‌, ద్రావిడ్‌, అజ‌హ‌ర్‌, గ‌వాస్క‌ర్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నారు.