విరాట్ ఖాతాలో మరో రికార్డ్..

 

టీమిండియా టెస్ట్ మ్యాచ్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పుడు మరో రికార్డ్ ను సొంత చేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్-భారత్ జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో మూడో రోజు ఇండియా బ్యాటింగ్ చేస్తుంది. ఈ మ్యాచ్ లో 35 పరుగులను పూర్తి చేసుకున్న కోహ్లి... ఈ ఏడాది వెయ్యి టెస్టు పరుగులను సాధించాడు. తద్వారా ఒక క్యాలెండర్ ఇయర్లో వెయ్యి టెస్టు పరుగులను పూర్తి చేసుకున్న మూడో భారత కెప్టెన్గా నిలిచాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్(1997), రాహుల్ ద్రవిడ్(2006)లు మాత్రమే ఈ ఘనతను సాధించిన భారత కెప్టెన్లు. విరాట్ సాధించిన వెయ్యి పరుగుల్లో రెండు డబుల్ సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 11 మ్యాచ్ల్లో 17 ఇన్నింగ్స్ ఆడుతున్న కోహ్లి ఈ మార్కును చేరాడు. ఇదిలా ఉండగా ఒక ఏడాది వెయ్యికి పైగా టెస్టు పరుగులు సాధించిన ఆటగాళ్లలో సచిన్ ముందంజలో ఉన్నాడు.