TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

యూపీయే డీలా...ఎన్డీయే టైట్: వినోద్ రాయ్

Published on: Mon Sep 29, 2014 2:00PM



యూపీయే హయంలో 2జి, బొగ్గు కుంభకోణాలను బయటపెట్టిన మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ వ్రాసిన ‘జస్ట్ నాట్ యాన్ అకౌంట్’ అనే పుస్తకం కొద్ది రోజుల క్రితం మార్కెట్లోకి విడుదలయింది. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ “సంకీర్ణ రాజకీయాల కారణంగా యూపీయే ప్రభుత్వాన్ని కూటమిలో భాగస్వామ పార్టీలు తలోదిక్కుకు లాగుతుండటం వలన పాలనపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ లేకుండా పోయిందని, దాని వలన అధికారులలో కూడా జవాబుదారీతనం లోపం కొట్టవచ్చినట్లు కనబడేదని అన్నారు. కానీ ఎన్డీయే ప్రభుత్వంపై మాత్రం ఆ పార్టీ నాయకత్వం పూర్తి నియంత్రణ సాధించిందని ఆయన అన్నారు. అదే విధంగా ఎన్డీయే ప్రభుత్వం అనేక నిరుపయోగామయిన వ్యవస్థలను రద్దు చేయడం వలన అధికారులకు స్వేచ్చగా నిర్ణయాలు తీసుకొనేందుకు వీలుపడుతోందని అంతే కాక దాని వలన వారిలో జవాబుదారీతనం పెరిగినట్లు స్పష్టంగా కనబడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తానిప్పుడు ప్రభుత్వంలో ఎటువంటి బాధ్యతలు నిర్వహించడం లేదు కనుక మరింత లోతుగా విశ్లేషించలేనని ఆయన తెలిపారు. మోడీ ప్రభుత్వంపై వినోద్ రాయ్ ప్రశంశలు గమనిస్తే బహుశః ఆయన ఏదయినా పదవి ఆశిస్తున్నారేమో అనే అనుమానం కలగడం సహజం. అయితే అటువంటి నిజాయితీపరుడయిన మాజీ ఉన్నతాధికారి సేవలను మోడీ ప్రభుత్వం ఉపయోగించుకొంటే మంచిదే.