ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా విక్రమ్‌నాథ్‌

 

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ విక్రమ్ నాథ్ నియమితులయ్యారు. ఆయన పేరు ఖరారు చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన అలహాబాద్‌ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ఉన్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఇప్పుడు జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ పేరును కొలీజియం ఖరారు చేసింది. త్వరలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.