అధికార బాషా సంఘం అధ్యక్షుడిగా పి. విజయబాబు
Published on: Sat Oct 29, 2022 11:38AM
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఆర్టీఐ మాజీ కమిషనర్ ,సీనియర్ జర్నలిస్టు పి.విజయ్ బాబును ఏపీ సర్కార్ నియమించింది.
విజయబాబు ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు. జగన్ సర్కారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే.
దీంతో ఖాళీ అయిన ఆ పదవిలో రాష్ట్ర ప్రభుత్వం పి. విజయబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుగా పలు పత్రికలలో పని చేసిన విజయబాబు.. ఒక ప్రముఖ పత్రికలో సంపాదకుడిగా పని చేశారు. ఆ తరువాత సమాచార హక్కు చట్టం కమిషనర్ ఉన్నారు. ఇప్పడు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమితులయ్యారు.


