బ్రేకింగ్ న్యూస్.. టీడీపీ వాళ్లంతా జైలుకే: విజయ్ సాయిరెడ్డి

టీడీపీ ఎంపీలు ఈ రోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి ఏపీలో జగన్ ప్రభుత్వ పాలన మరీ దారుణంగా ఉందంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ పై సెటైరికల్ కామెంట్స్ చేసారు . "బ్రేకింగ్ న్యూస్... చంద్రబాబు, లోకేశ్, మరియు మాజీ మంత్రుల అవినీతిపై ఎలాంటి విచారణ జరపవద్దని రాష్ట్రపతిని కోరిన టీడీపీ ఎంపీలు" అంటూ న్యూస ఛానల్ హెడ్ లైన్ తరహాలో సెటైర్లు వేశారు. అంతే కాకుండా " జగన్ ప్రభుత్వం టీడీపీ అవినీతిపై కొనసాగిస్తున్న సమగ్ర విచారణ పూర్తయితే ఇక అందరు జైలుకు పోవాల్సి వస్తుందని టీడీపీ నేతల ఆందోళన" అంటూ మరో సెటైర్ చేశారు.