వైసీపీలో నంబర్ టూ మారిపోయారు!!

వైసిపిలో నంబర్ వన్ ఎవరంటే ఎవరైనా ఠక్కున జగన్ అనే చెప్తారు. అలాగే నంబర్ టూ ఎవరు అంటే నిన్నటి వరకు ఎంపీ విజయసాయి రెడ్డి అనే చెప్తారు. అటు కేంద్రం తో, ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ తో మంచి రిలేషన్స్ మెయింటేన్ చేస్తూ పార్టీలో జగన్ కు కుడి భుజంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఏపీలో ఐతే ఆయనను ఉత్తరాంధ్ర సీఎం అని ఆయనంటే గిట్టని వాళ్ళు, అలాగే ప్రతిపక్షాలు ఆడి పోసుకుంటాయి. నిన్నటివరకు పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమమైనా అందులో అయన ప్రజెన్స్ ఉంది తీరాల్సిందే. ఐతే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఎంపీ విజయసాయి రెడ్డి ని మెల్లగా పక్కన పెట్టినట్లేనని తెలుస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ వ్యవహారాలను పూర్తి స్థాయిలో చూసుకోవాలని సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి పవర్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికోసం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం. ఇక నుండి రోజూ ఆయన కేంద్ర కార్యాలయానికి వచ్చి కొంత టైం పార్టీ వ్యవహారాల కోసం స్పెండ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు ఇక పార్టీ తరపున ఎలాంటి వ్యవహారాలకైనా విజయసాయిరెడ్డిని సంప్రదించరాదనే సంకేతాలు కొంత మంది నేతలకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ రోజుతో ఏడాది పాలన పూర్తైన సందర్భంగా ఈ పరిణామాలు వైసీపీ కేడర్ ను సైతం ఆశ్చర్య పరుస్తోంది.