పాడి రైతుల బకాయిలు క్లియర్!
Published on: Tue Sep 24, 2024 11:54AM

విజయ డెయిరీకి పాలు సరఫరా చేస్తున్న పాడి రైతుల పెండింగ్ బకాయిలను ఈ రోజు చెల్లించనున్నట్లు విజయ డెయిరీ యాజమాన్యం తెలిపింది. పాల బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి బాధలను అర్థం చేసుకున్న ప్రభుత్వం బిల్లులు చెల్లించేందుకు నిధులు మంజూరు చేసిందని పేర్కొంది.


