మామూలు బ్రెయిన్ కాదు మాలోకానిది.. లోకేశ్ ‘పెద్ద మనిషయ్యాక’!!

 

వైసీపీ నేత విజయసాయి రెడ్డి తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా టీడీపీ మీద విమర్శల డోస్ తగ్గించేలా లేరు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ మీద ట్విట్టర్ వేదికగా ఏ స్థాయిలో విమర్శలు చేసేవారో తెలిసిందే. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక విమర్శల డోసుని మరింత పెంచారు. ట్విట్టర్ వేదికగా టీడీపీ మీద విరుచుకుపడుతున్నారు.

ఉండవల్లిలో చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటి దగ్గరకు వరద వచ్చేలా వైసీపీ సర్కార్ కుట్ర చేసిందని, అందుకే ప్రకాశం బ్యారేజ్ గేట్లు లేటుగా తెరిచారని టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత నారా లోకేష్ కూడా ట్విట్టర్ లో ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దాంతో పాటు ప్రకాశం బ్యారేజ్ గేట్లకు అడ్డుగా పడవలను ఉంచారని ఆరోపించారు. కాగా ఈ వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి లోకేష్ మీద తీవ్ర విమర్శలు చేశారు.

"పప్పు, మాలోకం అంటూ సోషల్ మీడియా ఎందుకు కితకితలు పెడుతుందో అర్థమైందిగా. చంద్రబాబు ఇల్లు మునగాలని (కొట్టుకొచ్చిన) పడవను బ్యారేజి గేట్లకు అడ్డం పెట్టామట. 70 గేట్లు తెరిచినా నీరు వెనక్కి తన్నుతుంటే అందులో కుట్ర యాంగిల్‌ కనిపించింది. మామూలు బ్రెయిన్ కాదు మాలోకానిది." అని ఎద్దేవా చేశారు.

"లోకేశ్ ‘పెద్ద మనిషయ్యాక’ ఇంత పెద్ద వరదను చూసి ఉండడు. వానలు లేకున్నా7 లక్షల క్యూసెక్కులు ఎలా వస్తున్నాయో అంతుబట్టడం లేదతనికి. వరదలో కొట్టుకొచ్చిన పడవను చూసి కావాలనే ఎవరో నెట్టారని అపోహ పడుతున్నాడు. ఇరిగేషన్ వారితో కౌన్సిలింగ్ ఇప్పించండయ్యా. బేసిక్ నాలెడ్జన్నా పెరుగుతుంది." అని విమర్శించారు.