ఎన్నిసార్లైనా మోడీని కలుస్తా.. దాని కోసం కలుస్తా.. మీకెందుకు..?


నా ఇష్టం వచ్చినన్ని సార్లు ప్రధాని మోడీని కలుస్తా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుస్తా మీకెందుకు..? ఈ డైలాగులు కొట్టేది ఎవరనుకుంటున్నారా...? ఎవరో కాదు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గత కొద్దిరోజులుగా విజయసాయిరెడ్డి, మోడీల భేటీలపై పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఒకపక్క కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వస తీర్మానం పెట్టి ఇప్పుడు మోడీని కలవడం ఏంటని ఇప్పటికే పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనికో తోడు ఈ రోజు, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రితో మంతనాలు జరుపుతూ దొరికిపోయారు. మరి దీన్ని చూసి ఊరుకుంటారా..? ఇదే విషయాన్ని మీడియా వాళ్లు అడగగా... విజయసాయిరెడ్డికి చిర్రెత్తుకొచ్చినట్టుంది. అందుకే మీడియా పై చిందులు తొక్కారు. అవునండీ కలిశాను..  నా ఇష్టం వచ్చినన్ని సార్లు ప్రధానిని కలుస్తా, మీకెందుకు, చంద్రబాబుకి ఎందుకు.. నా ఇష్టం, మోడీని కలుస్తూనే ఉంటా అంటూ రెచ్చిపోయాడు...అక్కడితో ఆగకుండా... చంద్రబాబుని జైలుకి పంపిస్తా అని, దాని కోసం మోడీని కలుస్తా, మంత్రుల్ని కలుస్తా, అందరినీ కలుస్తా, చంద్రబాబును బోనులోకి ఎక్కించేంతవరకు ప్రధాన మంత్రిని, మంత్రులను కలుస్తూనే ఉంటానని రెచ్చిపోయారు.  కేంద్రంపై అవిశ్వాసం పెట్టే నైతిక హక్కు తమకు మాత్రమే ఉందని, చంద్రబాబుకి లేదని చెప్పారు... చంద్రబాబుపై చర్యలు తీసుకునేంత వరకు చేయాల్సిందంతా చేస్తామని అన్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డికి బాగానే కోపం వచ్చినట్టుంది పాపం. మరి దీనిపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి...