మళ్ళీ ‘విదర్భ’ హడావిడి...

 

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిన సమయంలో విదర్భ ఉద్యమ నాయకులు కూడా హడావిడి చేశారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విదర్భ ఉద్యమకారులు తమకూ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ఉద్యమం ఉద్ధృతం చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే విచిత్రంగా అలాంటిదేమీ జరగలేదు. అయితే తాజాగా మరోసారి విదర్భ ఉద్యమ హడావిడి మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి మహారాష్ట్రలోని నాగపూర్‌కి వెళ్ళారు. అక్కడ విదర్భ వాదులు నల్లజెండాలు చూపించి మోడీకి తమ నిరసన తెలిపారు. ప్రత్యేక విదర్భ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.