కేసీఆర్ సర్వే ఆంధ్రోళ్ళని తరిమేయడానికేనట... వీడియో

 

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఈనెల 19న నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే మీద ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. కేసీఆర్ ఈ సర్వేని సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారిని భయభ్రాంతులకు గురిచేయడానికి నిర్వహిస్తున్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఏదో మిలటరీ రూల్ మాదిరిగా నిర్వహిస్తున్న ఈ సర్వే మీద సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారిలో మాత్రమే కాకుండా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సర్వే బలవంతంగా చేయమని, ప్రజల మీద సర్వే రుద్దమని, ఇష్టం వున్నవారే సర్వేకి సహకరించవచ్చని కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇచ్చింది. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వ సర్వే మీద అందర్లోనూ అనుమానాలున్నాయి. ఆ అనుమానాలకు తగ్గట్టుగానే ఈ సర్వే నిర్వహిస్తోంది తెలంగాణలోని సీమాంధ్ర విద్యార్థులను, ఉద్యోగులను తరిమేయడానికే అనడానికి ఒక వీడియో ఆధారం దొరికింది. సీఎం కేసీఆర్ పీఆర్వో విజయ్ అనే వ్యక్తి మాట్లాడినట్టుగా భావిస్తున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ప్రసాద్‌ అనే పేరుతో పేర్కొంటున్న వ్యక్తి తెలంగాణ ప్రభుత్వం ఈ సర్వే చేయిస్తున్నది సీమాంధ్రులను తరిమేయడానికేనిన స్పష్టంగా చెప్పడం భయాందోళనలు కలిగిస్తోంది. అసలు ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు... అతను నిజంగానే కేసీఆర్ పీఆర్వోనా? తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే వెనుక ఉన్న ఉద్దేశం సీమాంధ్రులను తరిమేయడమేనా? ఈ అంశాలన్నిటి మీద స్పష్టత వచ్చేలా చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద వుంది.ఈ కింది వీడియో చూస్తే అసలు విషయమంతా తెలిసిపోతుంది.