TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబును కలిసిన విహెచ్ 

Published on: Tue Feb 25, 2025 4:07PM

తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వి. హన్మంత్ రావ్   ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును  మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఉమ్మడి రాష్ట్రంలో  దళిత ముఖ్యమంత్రిగా పని చేసిన దామోదం సంజీవయ్య పేరు ఒక జిల్లాకు  పెట్టాలని విహెచ్ కోరారు.  సంజీవయ్య పేరిట స్మృతి వనం  కూడా ఏర్పాటు చేయాలని విహెచ్ కోరారు. సంజీవయ్య  అత్యంత నిజాయితీపరుడని ఆయన అన్నారు. తన వినతిని చంద్రబాబు సానుకూలంగా తీసుకున్నట్టు విహెచ్ చెప్పారు. వీరువురు కొద్ది సేపు రాజకీయాల గూర్చి చర్చించుకున్నారు.