ఆ ఛానల్ ఎవరిది.. పేపర్ ఎవరిదిరా..?

 

నంద్యాల ఉపఎన్నిక పోరు హోరా హోరీగా సాగుతుంది. అధికార, విపక్ష పార్టీలు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఒకపార్టీ మీద మరొక పార్టీ విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి వేణుమాధవ్ తన నోటికి పనిచెప్పాడు. రెండు రోజుల క్రితమే వైసీపీ ఫైర్ బ్రాండ్ అయిన రోజాను.. రోజా ఎవరో తెలియదంటూ ఆమె పై కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా వైసీపీ అధినేత జగన్ పై పరోక్షంగా సెటైర్లు విసిరాడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు నంద్యాలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో వేణుమాధవ్ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాకు ఛానల్ లేదు.. పేపర్ లేదు అంటున్నావ్.. మరి ఆ ఛానల్ ఎవరిది.. పేపర్ ఎవరిదిరా..? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మరి వేణుమాధవ్ వ్యాఖ్యలపై జగన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.