సినిమాల్లో రొమాన్స్ పై వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు...

 

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అదేదో రాజకీయాలకు సంబంధించి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు చేసింది సినీరంగంపై. సీనీ పరిశ్రమ గురించి.. సినిమాల గురించి మాట్లాడిన ఆయన..  ప్రస్తుతం సినిమాల్లో అశ్లీలత బాగా పెరిగిపోయిందని... ఇలాంటివి సమాజంపై ప్రభావాన్ని చూపిస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హింస, అశ్లీలతలు లేకుండా... భావోద్వేగాలతో మంచి సినిమాలు తీస్తే, సమాజానికి మంచిదని.. సందేశాత్మక చిత్రాలను నిర్మించాలని చెప్పారు. అనవసరంగా హీరోయిన్లను అసభ్యంగా చూపించవద్దని దర్శక నిర్మాతలను కోరారు. హీరోయిన్లను ముట్టుకోకుండానే రొమాన్స్ ను అద్భుతంగా పండిచవచ్చని వెంకయ్య తెలిపారు. పెదవులు, కళ్లు, ముక్కు, చూపులతో కూడా రొమాన్స్ ను పండించవచ్చని చెప్పారు.