హిమాచల్ సీఎంకు మరో షాకిచ్చిన సీబీఐ

అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న హిమాచల్‌‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు మరోసారి చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనకు బెయిల్ ఇవ్వరాదంటూ సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది. అక్రమాస్తుల కేసులో తనకు, తన భార్యకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వీరభద్రసింగ్ పాటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణకు స్వీకరించిన న్యాయస్థానం పిటిషన్‌పై స్పందన తెలియజేయాల్సిందిగా సీబీఐను ఆదేశించింది. దీనిపై స్పందించిన సీబీఐ..ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎంకు, ఆయన భార్యకు బెయిల్ ఇవ్వొద్దని న్యాయస్థానానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. వీరభద్రసింగ్ ప్రస్తుతం సీఎం హోదాలో ఉన్నారని..అలాంటి వ్యక్తికి బెయిల్ ఇస్తే కేసు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని అభిప్రాయ పడింది.