పవన్ తో భేటీ.. జనసేనలోకి వంగవీటి రాధా!!

 

టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పగా.. మరికొందరు నేతలు కూడా పార్టీని వీడనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ షాకింగ్ న్యూస్ తెర మీదకు వచ్చింది. టీడీపీ నేత వంగవీటి రాధా టీడీపీని వీడి జనసేనలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

వంగవీటి రాధా ఈరోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో సమావేశం అయ్యారు. విజయవాడలో పవన్ కల్యాణ్ తో సమావేశమైన రాధా.. ఏపీలో రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై జనసేనానితో చర్చించినట్లు సమాచారం. మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ఈ భేటీ జరిగింది. కాగా, ఈరోజు సాయంత్రం లేదా రేపు వంగవీటి రాధా జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.