అందరికీ చెప్పే వెళ్తా...నా గురించి నాకు తెలుసు....


వైసీపీ నేత వంగవీటి రాధా టీడీపీలో చేరుతున్నట్టు గత నాలుగు రోజుల నుండి వార్తలు హల్ చల్ చేస్తున్నసంగతి తెలిసిందే కదా. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్‌ను రాధ ఆశిస్తున్నారని, అయితే ఆ సీటును మల్లాది విష్ణుకు ఇచ్చేందుకు జగన్ సిద్ధపడడంతో అలక వహించి రాధ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై రాధా స్పందించారు. దేనికైనా సమయం రావాలని...” నా పని నేను చేసుకుని వెళ్తున్నా.. పార్టీ మారాలని భావిస్తే పక్కా ప్రణాళికతోనే వెళ్తా. నా రాజకీయ భవిష్యత్ గురించి నాకు తెలుసు. పార్టీ మారాలని భావిస్తే కంగారు పడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటా ” అని ఆయన చెప్పారు. అందరికీ చెప్పాకే వెళ్తానని అన్నారు. అంతేకాదు... తనకు టీడీపీ నేతల్లో బంధువులు, స్నేహితులు ఉన్నారని, వారితో కలుస్తుంటానని... ప్రతి సంబంధాన్నీ రాజకీయాలతో ముడిపెట్టరాదన్నారు. చిన్న చిన్న పదవులు ఆశించి పార్టీ మారబోనని, ఎమ్మెల్యేగా పని చేసిన తనకు ఎమ్మెల్సీ ఎందుకని ఆయన ప్రశ్నించారు. మొత్తానికి రాధా సూటిగా సమాధానం చెప్పకపోవడంతో... భవిష్యత్తులో పార్టీ మార్పు ఉండచ్చు అని అంటున్నారు.