టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వంశీ రిమాండ్
Published on: Tue Mar 4, 2025 10:57AM
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ విధించారు. గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో వంశీ ఎ71 నిందితుడిగా ఉన్నారు. మూడో తేదీలోగా కోర్టుకు హాజరుపర్చాలని విజయవాడలోని ఎసిజెఎం కోర్టు ఆదేశించింది. టిడిపి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్దన్ కిడ్నాప్ కేసులో వంశీ ప్రధాన నిందితుడు. ఈ కేసులో వంశీని హైద్రాబాద్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ సబ్ జైలులో ఉన్న వంశీని వర్చువల్ గా కోర్టుకు హాజరుపర్చారు. నిందితుడు వంశీకి 17 వ తేదీ వరకు రిమాండ్ విధించారు. ఒక్కరే ఉండే జైలు గది నుంచి ఎక్కువ మంది ఖైదీలు ఉండే బ్యారక్ లో మార్చేందుకు ఎస్సి ఎస్టి కోర్టు అనుమతించింది. సత్యవర్దన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ లో ఉన్న గంట వీర్రాజు, వేల్పూరువంశీలను పోలీసు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై ఎస్ సి ఎస్ టి కోర్టు న్యాయాధికారి హిమ బిందు తీర్పు నిచ్చారు. మంగళ, బుధవారాలు పోలీసు కస్టడీకి ఇవ్వాలని తీర్పు నిచ్చారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరు పోలీసు కస్టడీలో ఉండాలని ఆదేశించారు.


