కొడాలి నానికి వల్లభనేని వంశీ వార్నింగ్..

 

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి టీడీపీ ఎమ్మల్యే వల్లభనేని వంశీ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఏ విషయంలో అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే... జగన్ పాదయాత్రలో భాగంగా కృష్ణాజిల్లా చేరిన సంగతి తెలిసిందే. ఇక ఈ పాదయాత్రలో భాగంగా.... కొడాలి నాని మాట్లాడుతూ తనకూ.. నానికి మధ్య సాన్నిహిత్యం ఉందని చెప్పుకొచ్చారు. అయితే నాని మాటలపై స్పందించిన వంశీ..ఆయనపై విమర్శలు గుప్పించారు. నాని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కొడాలి నాని పిచ్చి కుక్కలా మాట్లాడితే సహించేది లేదని చెప్పారు. నాని ఒకప్పుడు తనకు స్నేహితుడని, ఇప్పుడు కాదని తెలిపారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న కొడాలి నానితో పాటు బరితెగించి మాట్లాడుతున్న ఇతర నేతలను జగన్ కంట్రోల్ చేయాలని... లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.